Vinod Kumar | మెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరుగడంపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు ఏమాత్రం మంచివికావన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. బాధ్యులు ఎవరైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభాకర్రెడ్డి సౌమ్యుడని.. ప్రజాసేవకు అంకితమైన గొప్ప వ్యక్తన్నారు. అలాంటి వ్యక్తిపై హత్యాయత్నం జరుగడంపై ఆవేదన వ్యక్తం చేశారు.