B Vinod Kumar | కరీంనగర్ కార్పొరేషన్ : దేశంలో త్వరలో చేపట్టబోయే పార్లమెంట్ స్థానాల పునర్వీభజనలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గకుండా.. 1971 నిష్పత్తి ప్రకారమే పూర్వ విభజన చేస్తారని తాను భావిస్తున్నట్లు మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న వినోద్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు తగ్గే అవకాశం లేదని.. హోంమంత్రి అమిత్ షా అంటున్నారని.. దాన్ని అనుసరించి ఈ పద్ధతి పాటిస్తారని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఒకవేళ జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని పార్లమెంట్ స్థానాలను డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గితే ఊరుకునే ప్రసక్తే ఉండన్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక ఆదాయం వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దేశానికి రూ.100 ఇస్తే అందులో 42 శాతం మాత్రమే తిరిగి వస్తుందన్నారు. అదే ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు మాత్రం రూ.100కి రూ.400, రూ.600 పంపిణీ జరుగుతుందన్నారు. ఈ లెక్కన ఎంపీ స్థానాలు తగ్గితే దక్షణాది రాష్ట్రాలు తిరగబడే అవకాశం ఉంటుందన్నారు.