హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): వాతావరణ మార్పులపై దేశవ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించి, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదనే స్పృహ కల్పించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు సూచించారు. గురువారం రాజ్యసభలో వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానాలపై జరిగిన చర్చలో కేశవరావు మాట్లాడారు. గ్లోబల్ వార్మింగ్ మానవాళి మనుగడకు పెనుముప్పు సృష్టిస్తున్నదనే ఆందోళనల నేపథ్యంలో దేశంలో పర్యావరణ పరిరక్షణపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణపై ప్రస్తుతం అనుసరిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో సమూల మార్పు లు చేయాలని సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పవర్ను వినియోగించాలని, తెలంగాణ సోలార్ పవర్కు ప్రా ధాన్యం ఇస్తున్నదని ఆయన తెలిపారు.