హైదరాబాద్/ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ)/హన్మకొండ చౌరస్తా/కారేపల్లి/నార్కట్పల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవ ర్లు బుధవారం భిక్షాటన చేపట్టారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉ చిత ప్రయాణం కల్పించడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మా బతుకులు రోడ్డున పడ్డాయి.. అ క్కా సాయం చేయి.. అమ్మా సాయం చేయి’ అంటూ భిక్షమెత్తుతూ నిరసన తెలిపారు. తె లంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (టీఏటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా భిక్షాటన చేశారు. రోజుకు కనీసం రూ.200 కూడా రావడం లేదని, పిల్ల లు ఫీజలు, ఇంటి కిరాయి, వాహన ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తంచేశారు.
తమను వెంటనే ఆదుకోవాలని, ప్రతి నెలా రూ.15 వేల జీవన భృతి అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 7న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు చెప్పారు. టీఏటీయూ ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి విభిన్న నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. బుధవారం హైదరాబాద్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. కూడళ్ల వద్ద భిక్షాటన చేశారు. కరీంనగర్ బస్టాండు ఎదుట, తెలంగాణ చౌక్లో బాటసారులు, ప్రయాణికుల వద్ద భిక్షాటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరిపించి తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ చౌక్ వద్ద ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి దండాలు పెట్టి వేడుకున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రానికి చెందిన ఆటోవాలాలు ఖమ్మం- ఇల్లందు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఫ్రీ బస్ పథకంపై రాష్ట్రప్రభుత్వం పునరాలోచన చేయాలని వేడుకుంటున్నారు. ఆటోడ్రైవర్లు హనుమకొండ వేయిస్తంభాల దేవాలయ సమీపంలో భిక్షాటనతో నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లాలో పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నార్కట్పల్లిలోని ఆర్టీసీ డిపో ఎదుట రాస్తారోకో చేశారు. నల్లగొండ, మిర్యాలగూడ బస్టాండ్లో, ఆలేరులో భిక్షాటన చేసి నిరసన తెలిపారు.
రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావుకు ఆటో డ్రైవర్ల అధ్యయన కమిటీ నివేదిక అందించింది. బుధవారం తెలంగాణభవన్లో ఆ కమిటీ నేతలు ఎల్ రూప్సింగ్, జీ రాంబాబుయాదవ్, వేముల మారయ్య, పీ నారాయణ నివేదిక అందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని, రాష్ట్రంలోని 33 జిల్లాలు తిరిగి అధ్యయనం చేసి ఈ నివేదిక సమర్పించామని కమిటీ నేత ఎల్ రూప్సింగ్ తెలిపారు.