కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 10: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన మరో ఆటో డ్రైవర్ గుండెపోటుతో మరణించాడు. కుటుం బసభ్యుల వివరాల ప్రకారం.. కరీంనగర్లోని చామనపల్లికి చెం దిన బండపెల్లి భూమయ్య (40) పందొమ్మిదేండ్లుగా ఆటో నడుపుతూ బతుకు దెరువు సాగిస్తున్నాడు. ఆటో ద్వారా వచ్చే డబ్బుతో భార్యాబిడ్డలతోపాటు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సాదుతున్నాడు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆ కుటుంబానికి శాపంగా మారింది. ఆటో కు గిరాకీ తగ్గిపోవడంతో భూమయ్య ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యాడు. రెండు నెలలుగా పిల్లల ఫీజులు కట్టలేక, కిస్తీలు చెల్లించలేక సతమతమవుతున్నాడు. ‘ఆటో నడవకుంటే మనమం తా ఎట్లా బతుకుడు?’ అని తరుచూ భా ర్య శారదతో చెబుతుండేవాడు.
శనివారం ఆటోతో చామనపల్లి నుంచి క రీంనగర్ వెళ్లాడు. అక్కడి ఓ టీకొట్టులో పేపర్ చదువుతూ చాయ్ తాగుతూ కుప్పకూలాడు. స్థానికులు సమీప దవాఖానకు తీసుకెళ్లగా మరణించినట్టు వై ద్యులు నిర్ధారించారు. భార్యాబిడ్డలు ద వాఖానకు చేరుకొని ఇంటిపెద్దదిక్కును చూసి భోరుమన్నారు. ఫ్రీబ స్సు స్కీమే భూమయ్య మరణానికి కారణమని, 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆటో యూనియన్ నేతలు డిమాండ్ చేశారు.