హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కొత్తగూడెం చౌరస్తాలో ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని శ్రీశైలం గా గుర్తించారు. అతని స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఉత్తటూరు అని చెప్పారు. నల్లగొండ వైపు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.