దేవరుప్పుల, మార్చి 16 : ఆర్థిక ఇబ్బందులకు మరో ఆటో డ్రైవర్ బలైన ఘటన జనగామ జిల్లా కామారెడ్డిగూడెంలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పులిపంపుల నరేశ్ (30) పదేండ్లుగా ఆటో నడుపుతున్నాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోలకు గిరాకీలు తగ్గాయి. ఈ క్రమంలో నరేశ్ ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. నరేశ్ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య విజయ, ఇద్దరు కుమారులు ఉన్నారు.