ముస్తాబాద్, ఏప్రిల్ 4 : ఉపాధి కరువై.. కుటుంబం గడవక.. మరోవైపు అప్పులు భారమై జీవితంపై విరక్తితో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో శనివారం చోటుచేసుకున్నది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. ముస్తాబాద్కు చెందిన మారెల్లి శ్రీనివాస్ (52) కొన్నేండ్లుగా ముస్తాబాద్ నుంచి దుబ్బాక, గంభీరావుపేట, సిరిసిల్లలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సొంత ఇల్లు లేకపోవడం తో స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. అప్పటికే కొంత అప్పు ఉండగా, రెం డేండ్ల కిందట కూతు రు వివాహం చేయడంతో మొత్తం రూ.5 లక్షల వరకు అప్పు అయ్యింది. రెండేండ్లుగా ఆటో నడవకపోవడం, కుటుంబ పోషణ భారంగా మారడం, అప్పులు ఎలా తీర్చాలో తెలియక నిత్యం మదనపడుతుండేవాడు. దీంతో శనివారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.