సూర్యాపేట : సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులపై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ఎస్సీ కాలనీకి చెందిన 100మంది టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, ఎంపీపీ గుండగాని కవిత, పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీ చెరకు సృజన, కటకం వెంకటేశ్వర్లు, గోపగాని శ్రీను, రమేశ్, మార్కెట్ చైర్మన్ పులుసు యాదగిరిగౌడ్, నల్లు రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.