భువనగిరి కలెక్టరేట్, జనవరి 5 : ఇద్దరు బాలికలను ఓ యువకుడు తన ఇంట్లో నిర్బంధించిన ఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని బీఎన్ తిమ్మాపు రంలో గురువారం చోటుచేసు కున్నది. పోలీసుల కథనం ప్రకా రం.. గ్రామానికి చెందిన మేడబో యిన యాకేశ్.. ఓ ఇద్దరు బాలికల కు మాయమా టలు చెప్పి తన ఇంటికి పిలిపిం చుకొని బయటి నుంచి తలుపులకు తాళాలు వేసి నిర్బంధించాడు. సాయంత్రం అవు తున్నా బాలికలు ఇంటికి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెం దారు.
యాకేశ్ అనే యువకుడిపై అను మానంతో స్థానికులతో కలిసి అతడి ఇంటివద్ద కాపు కాశారు. అతడు ఇంట్లో నుంచి ఎంతకీ బయ టకు రాకపోవ డంతో ఆగ్రహించిన స్థానికులు ఇంటిపై దాడి చేశారు. పోలీసులు వచ్చి తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి సోదా చేయగా.. యా కేశ్ ఇద్దరు బాలికలతో పూజగదిలో నక్కి ఉండగా అదుపులోకి తీసు కున్నారు. ఆగ్రహించిన స్థానికులు యాకేశ్ ఇంటి అద్దాలు పగుల గొట్టారు. రెండు బైక్లకు నిప్పం టించారు. పోలీసులు గ్రామ స్థులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. నింది తుడు యాకేశ్పై పోక్సో కేసు నమోదు చేశారు.