Medical Colleges | హైదరాబాద్, నవంబర్ 29(నమస్తే తెలంగాణ): మేనేజ్మెంట్ కోట సీట్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్చేశారు. ఉద్దేశపూర్వకంగా పీజీ మెడికల్ కాలేజీలను బ్లాక్చేసి అమ్ముకున్నట్టు ఈడీ పేర్కొన్నది.
ఇప్పటి వరకు ఈ కేసులో ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ మొత్తం రూ.9.71 కోట్లు. తదుపరి విచారణ పురోగతిలో ఉన్నట్లు ఈడీ వెల్లడించింది.