వర్ధన్నపేట, ఆగస్టు 16: వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. రాజస్థాన్కు చెందిన కార్మికులు బుధవారం ఉదయం వరంగల్లో ఆటోను కిరాయికి తీసుకొని చెట్లపై తేనె తీసేందుకు తొర్రూరుకు బయలు దేరారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద బస్టాండ్ సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న జబాబత్ కురైరి (45), సురేశ్కురైరి (36), నితీష్కుమార్ (13), అమిత్ మండల్ (34), రూప్చంద్(45)తోపాటు వరంగల్ పుప్పాలగుట్టకు చెందిన ఆటో డ్రైవర్ బట్టు శ్రీనివాస్(42) మృతి చెందాడు.
మరో కార్మికుడు వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. లారీ డ్రైవర్ వాహనాన్ని అజాగ్రత్తగా, వేగంగా నడపడం వల్లే అదుపు తప్పి పూర్తిగా కుడివైపు వెళ్లి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టినట్టు సీసీ కెమెరాలో రికార్డయింది. వరంగల్ సీపీ రంగనాథ్, ఏసీపీ సురేశ్, సీఐ శ్రీనివాస్, ఎస్సై ప్రవీణ్ ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు.