ఆదిలాబాద్ : ఆదిలాబాద్(Adilabad) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా ఆత్రం సక్కు (Atram Sakku) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు అందజేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవలక్ష్మి, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్లమెంటులో తెలంగాణ హక్కుల పరిరక్షణకై బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాలు బడుగు, బలహీన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కాంగ్రెస్ నాయకులు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ గెలుపుతోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.