హిమాయత్నగర్, జూలై 12: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా జీహెచ్ఎంసీ పరిధిలో ధూపదీప నైవేద్య పథకం అమలు చేసినందుకు ధూపదీప నైవేద్య అర్చక సంఘం గ్రేటర్ ప్రతినిధి బృందం బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి శాలువాతో సత్కరించింది. ఈ సందర్భంగా సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీరంగం గోపీకృష్ణమాచార్యులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో దీపం వెలగాలనే సంకల్పంతో దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.
ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు గురువారం నుంచి 26వ తేదీ వరకు ధూపదీప నైవేద్య అర్చకులు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ధూపదీప నైవేద్యాలకు ప్రతినెలా ఇచ్చే 6 వేలను 10 వేలకు పెంచడంతోపాటు 3,500 ఆలయాల్లో పథకం అమలు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి నంద నం హరికిషన్, గ్రేటర్ ఉపాధ్యక్షుడు చంద్రప్రకాశ్స్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి శివకుమార్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి కుమారస్వా మి, సభ్యుడు శ్రీనివాసచార్యులు పాల్గొన్నారు.