గాజా, అక్టోబర్ 14: ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం అమలు జరుగుతూ శాంతి నెలకొందని భావిస్తున్న తరుణంలో గాజాలో మళ్లీ హింస నెలకొంది. అయితే ఈసారి ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాదు.. హమాస్, అల్ఖైదా అనుబంధ సంస్థ డోగ్మూష్ తెగ మధ్య జరిగిన ఘర్షణల్లో 64 మంది మరణించారు. వీరిలో 52 మంది డోగ్మూష్ తెగవారు, 12 మంది హమాస్ ఉగ్రవాదులు ఉన్నారు. మృతుల్లో హమాస్ సీనియర్ అధికారి కుమారుడు బసెమ్ నయీమ్ కూడా ఉన్నట్టు హమాస్ టీవీ చానల్ వెల్లడించింది.