మధిర, నవంబర్ 24 : భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి పరిహారం మంజూరు చేయడానికి అతడి భార్య నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిరలో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ రమేశ్ కథనం ప్రకారం.. 2024లో సహజ మరణం పొందిన ఓ భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి న్యాచురల్ డెత్ బెనిఫిట్ స్కీం కింద ప్రభుత్వం రూ.1.30 లక్షలు మంజూరు చేస్తుంది. ఈ దరఖాస్తును పరిశీలించి, పరిహారం మంజూరు చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కర్నె చందర్ మృతుడి భార్య నుంచి రూ.30 వేలు లంచం డిమాండ్ చేసి 15వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని ఓ టీ స్టాల్లో బాధితురాలు చందర్కు రూ.15 వేలు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.