హైదరాబాద్ : వనపర్తిలో వేరుశనగ ప్రాసెసింగ్, అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం కెనరా బ్యాంక్ అధికారులు హైదరాబాద్లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగకు తెలంగాణ ప్రసిద్ధి అన్నారు. దక్షిణ తెలంగాణ దానికి అనుకూలమైన ప్రాంతమని చెప్పారు. ప్రభుత్వం తరపున వేరుశనగ సాగును ప్రోత్సహిస్తామని మంత్రి పేర్కొన్నారు. వేరుశనగ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటునందించాలని బ్యాంకు ప్రతినిధులను మంత్రి కోరారు. కాగా, ప్రాజెక్ట్ రిపోర్ట్తో వస్తే కెనరా బ్యాంకు తోడ్పాటు ఉంటుందని అధికారులు మంత్రికి వివరించారు. ఎన్ని యూనిట్లకయినా ప్రోత్సాహం అందిస్తామన్నారు. త్వరలో వనపర్తిలో కెనరా బ్యాంక్ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
Suryakumar Yadav: ఇంగ్లండ్ బయలుదేరిన సూర్యకుమార్ యాదవ్
రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు
జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత
మహబూబాబాద్ జిల్లాలో 120 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత