హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు గురువారం బిజీబిజీగా గడిపారు. పలు విభాగాల అధిపతులతో వరుస సమీక్షలు నిర్వహించారు.
నగరంలోని ఓ హోటల్లో,సీబీడీటీ, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు, ఎక్సైజ్, రాష్ట్ర, కేంద్ర జీఎస్టీ, ఈడీ, డీఆర్ఐ, సీఐఎస్ఎఫ్, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? ఏ విధంగా సన్నద్ధం కావాలి? అనే అంశాలపై చర్చించింది. ఈ బృందానికి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్రశర్మ నాయకత్వం వహించారు.