Telangana Assembly | శాసనసభ, శాసన మండలి సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం శాసనసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 8న బడ్జెట్పై చర్చ జరగనుంది. 9,10, 11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. 12వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించనున్నారు. అనంతరం సమావేశాలు వాయిదా పడనున్నాయి. ఈ నెల 3వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
నీటి పారుదల రంగం రూ. 26,885 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు
హోంశాఖకు రూ. 9,599 కోట్లు
ఆర్థిక శాఖకు రూ. 49,749 కోట్లు
విద్యాశాఖకు రూ. 19,093 కోట్లు
వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు
ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1463 కోట్లు..
పరిశ్రమల శాఖకు రూ. 4,037 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు రూ. 2,500 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు రూ. 31,426 కోట్లు
పురపాలక శాఖకు రూ. 11,327 కోట్లు
ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ. 3,117 కోట్లు
ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు రూ. 366 కోట్లు
రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు..
రైతుబందు పథకానికి రూ. 15,075 కోట్లు
రైతుబీమా పథకానికి రూ. 1589 కోట్లు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ. 200 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ. 12 వేల కోట్లు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 3,210 కోట్లు
దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.
ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
ఆయిల్ ఫామ్కు రూ. 1000 కోట్లు
అటవీ శాఖ కోసం రూ. 1,471 కోట్లు
హరితహారం పథకానికి రూ. 1471 కోట్లు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ. 4,834 కోట్లు