కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్గా అశోక్ ఎస్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రజలశక్తి శాఖ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేఆర్ఎంబీ ప్రస్తుత చైర్మన్ శివనందన్కుమార్ గురువారం ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో అశోక్ గోయల్ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారి చేసింది. ఇక పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోగా అతుల్జైన్కు అదనపు బాధ్యతలను అప్పగించారు.