హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజకీయ జీవితం ముగిసిందని, అందుకే మతిస్థిమితం కోల్పోయి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్గౌడ్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. మతిస్థిమితం బాగోలేనప్పుడు ఇంట్లో కూర్చుంటే బాగుంటుందని హితవు పలికారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు ఓడించినా మైనంపల్లికి బుద్ధి రాలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుపై వ్యక్తిగత విమర్శలు చేశారని, ఫలితం ఎన్నికల్లో కనిపించిందని తెలిపారు. నిర్మాణాత్మక విమర్శలు చేయాలని, వీధి రౌడీలా మాట్లాడటం సరికాదని సూచించారు. అధికార పార్టీ నేతగా బాధ్యతతో వ్యవహరిస్తే మంచిదని, లేదంటే ప్రజలు సహించరని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీకి ఇది స్పీడ్బ్రేకర్ మాత్రమేనని, తెలంగాణవాదులమంతా కేసీఆర్ వెంటే ఉన్నామని, తమ నేతల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలిపారు.