హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): 30 శాతం పీఆర్సీ ప్రకటించడంతోపాటు ఇతర సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు ఆశ వర్కర్లు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం టీఆర్ఎస్వీకే రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబు ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల ప్రతినిధి బృందం మంత్రి హరీశ్రావును కలిశారు. అనంతరం తెలంగాణభవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీకే ప్రధాన కార్యదర్శి పీ నారాయణ, కార్యదర్శి బీ శివశంకర్, ఆశ వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రావుల సంతోషి, బీ కరుణ, ఎం యాదమ్మ, ఎల్ శోభ పాల్గొన్నారు.