రేవంత్రెడ్డి అన్నట్టు మూడు గంటల కరంట్ ఇస్తే ఇగ మేం ఎవుసం జేసుడు ఉండది. చెలక(పత్తి, మొక్కజొన్న) పంటలకు ఒక ఎకరం నీరు పారాలంటే 4గంటల కరంట్ అవసరమైతది. అదే పొలమైతే ఎకరాకి 2గంటలు పడుతది. నాకు 8 ఎకరాల ఎవుసం భూమి ఉంది. 12 గంటలు రెండు బావులు నడిస్తే తప్ప నేను ఎవుసం చేయలేను. గతంలో నాలుగు ఎకరాలు ఎవుసం చేసే నేను సీఎం కేసీఆర్ పుణ్యమాని 24 గంటల కరెంటు రావడంతో గిప్పుడు నాకున్న ఎనిమిదెకరాలు సాగు జేసుకుంటున్న.
3 గంటల కరంట్ ఉంటే మాకు పాత రోజులే దిక్కవుతయ్. తెలంగాణ రాక ముందు 9 గంటల కరంట్ అనుడే తప్ప మూడు గంటలు కూడా రాలేదు. అది ఎప్పుడు అత్తదో, ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. అర్ధరాత్రి ఇంట్లకెళ్లి అడవిలోకి పోయేది. పురుగు, గిట్ట ఉండేది. రాత్రి అక్కడే పడుకుని కరంట్ ఎప్పుడు వస్తదోనని ఎదురు చూసేది. కేసీఆర్ వచ్చినంకనే రైతుల కట్టాలన్నీ తీరినయ్. రేవంత్రెడ్డి లెక్క చేస్తే రైతులు ఎవుసం బంద్ పెట్టుకుని కైకిలీ, కూలీలకు పోవుడే అయితది.