జూన్ 20 నుంచి యాత్రలు ప్రారంభం
హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం
హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు హాజ్కమిటీ చైర్మన్ మహ్మద్సలీం వెల్లడించారు. యాత్రికుల కోసం హైదరాబాద్లోని నాంపల్లిలోని హజ్ హౌస్లో ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్లోని ఏర్పాట్లను హజ్కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫివుల్లాతో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఏపీలోని పరిసర జిల్లాల నుంచి ఈ సంవత్సరం 3000 మంది యాత్రికులు జూన్ 20వ తేదీ సోమవారం ఉదయం నుంచి విడతలవారీగా బయలుదేరుతారని తెలిపారు.
ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్టు వచ్చిన యాత్రికులకే విమానాల బుకింగ్కు అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. రెండవ విమానంలో బయలుదేరనున్న యాత్రికులు శనివారం ఉదయం 8:00 గంటలకు రిపోర్ట్ చేసి, ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ నిజాముద్దీన్ , ఏఈవో మహమ్మద్ ఇర్ఫాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.