హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తెలంగాణ పోలీసుశాఖ కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికలకు సుమారు లక్ష మంది సిబ్బందిని భద్రతకు వినియోగించగా..లోక్సభ ఎన్నికలకు సుమారు 70 వేల మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఈ మేరకు సమస్యాత్మక ప్రాంతాలను అధ్యయనం చేసిన పోలీసు శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టు తెలిసింది.