గజ్వేల్, సెప్టెంబర్ 15: సిద్దిపేట జిల్లా గజ్వేల్ అభివృద్ధ్దిని చూసి జార్ఖండ్ బృందం ఆశ్చర్యపోయింది. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని కొనియాడింది. శుక్రవారం సాయంత్రం జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన అధికారుల బృం దం సభ్యులు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నోడల్ అధికారి వినోద్గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పర్యటించారు.
గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలో పర్యటించిన బృందం సభ్యులకు ఎఫ్ఆర్వో కిరణ్కుమార్ అడవుల అభివృద్ధి, వాటి పరిరక్షణకు తీసుకున్న చర్యలు, గత తొమ్మిదేండ్ల కాలంలో పెరిగిన అడవుల విస్తీర్ణం, హరితహారంలో తీసుకున్న చర్యలను వివరించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలోని వెజ్, నాన్వెజ్ మార్కెట్ను సందర్శించిన జార్ఖండ్ అధికారుల బృందానికి గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ వ్యాపారులకు కల్పిస్తున్న సదుపాయాలను వివరిం చారు. మార్కెట్లో నాజ్వెజ్ మార్కె ట్, సూపర్ మార్కెట్, కూరగాయలు, పూలు, పండ్లు స్టాల్స్ను చూసిన అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.