హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): పాస్పోర్టుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో సుదీర్ఘ నిరీక్షణను తగ్గించేందుకు ఈ నెల 27 నుంచి 2 వారాలపాటు రోజుకు 500 చొప్పున అదనంగా అపాయింట్మెంట్లను పెంచుతున్నట్టు ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. 27 తేదీ అపాయింట్మెంట్లు 25వ తేదీ సాయంత్రం నుంచే పాస్పోర్టు సేవా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అంబేదర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఐదు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్కే), 14 పాస్పోర్ట్ ఆఫీస్ సేవా కేంద్రాల్లో (పీవోఎస్కే) తాతాలికంగా కార్యకలాపాలను నిలిపివేసినందున రెండు వారాలపాటు అదనపు అపాయింట్మెంట్లను విడుదల చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.
దరఖాస్తుదారులు www.passportindia.gov.in వెబ్సైట్ ద్వారా లేదా mPassportseva మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని, స్లాట్లు బుక్చేసిన పీఎస్కేలకు హాజరుకావాలని సూచించారు. దరఖాస్తుదారులందరికీ ముందస్తు అపాయింట్మెంట్ తప్పనిసరని, నేరుగా పీఎస్కే, పీవోపీఎస్కేలకు వచ్చేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. పాస్పోర్టుల కోసం మధ్యవర్తులను, బ్రోకర్లను సంప్రదించవద్దని, ఆన్లైన్ ద్వారా ముందే అపాయింట్మెంట్ పొంది వస్తే సరిపోతుందని
పేర్కొన్నారు.