హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో న ర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను మే 12న ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా ఇవ్వనున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థుల జాబితాను వి డుదల చేసినట్టు వెల్లడించారు. నియామ క పత్రాలు అందజేసేందుకు ఏర్పాటు చే యాలని ఆదేశించారు. మే 15నాటికి అ సిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు మంత్రికి వివరించారు.
విదేశీ పర్యటనల్లో అవకాశం కల్పించాలి ; విద్యాశాఖ అధికారులకు పలు సంఘాల నేతల వినతి
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ (విదేశీ పర్యటనల్లో) ఇంటర్ విద్యలో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్లకు అవకాశం కల్పించాలని పలు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ టీచర్లను విదేశాలకు పంపించే విషయంలో తమను కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ఉపాధ్యక్షుడు మాచర్ల రామకృష్ణగౌడ్, తెలంగాణ ఇంటర్ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైలారం జంగయ్య విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పరశు రాములు, నరేందర్, శంకర్, సుధారాణి, సతీశ్రెడ్డి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.