హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) సంఘం హైదరాబాద్ నగర సహాయ కార్యదర్శులుగా నలుగురిని నియమించినట్టు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ తెలిపారు. సాంకేతిక విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు పుల్లయ్య, కళాశాల విద్యాశాఖ ఉపసంచాలకురాలు పీ పద్మలత, ఇంటర్ విద్య సహాయ సంచాలకురాలు మేరీ ప్రసన్నలత, ఇంటర్విద్య సంయుక్త కార్యదర్శి భీమ్సింగ్ను నగర సహాయ కార్యదర్శులుగా నియమించి నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో నగరశాఖ అధ్యక్షుడు జీ వెంకటేశ్వర్లు, తెలంగాణ ఉన్నత విద్యాశాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.