హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఆర్థికసాయం కో సం మరణించిన జర్నలిస్టుల బాధిత కుటుంబ స భ్యులు 21లోగా దరఖాస్తు చేసుకోవాలని మీడి యా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదం బారిన పడిన లేదా అనారోగ్య కారణాలతో పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు కూడా ఆర్థిక సహాయార్థం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
దరఖాస్తుతోపాటు జర్నలిస్టు మరణ, ఆదాయ, కుటుంబ ధ్రువీకరణ పత్రాలతోపాటు గుర్తింపు కార్డు ఉండాలని, సంబంధిత జిల్లా పౌరసంబంధాల అధికారి ద్వారా ధ్రువీకరించి పంపాలని కోరారు. పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు దరఖాస్తుతోపాటు ప్రభుత్వ సివిల్ సర్జన్ డాక్టర్తో పనిచేసే స్థితిలో లేడు (ఇన్కెపాసిటేషన్) అని ధ్రువీకరణ సర్టిఫికెట్ ఇతర పత్రాలను జత చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చిన వారు, గతంలో మీడియా అకాడమీ నుంచి లబ్ధి పొందిన వారు, పెన్షన్ పొందుతున్న వారు అనర్హులని తెలిపారు. కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడి యా అకాడమీ, ఇంటి.నం.10-2-1, ఎఫ్డీసీ కాంప్లెక్సు, 2వ అంతస్థు, సమాచార భవన్, మాసబ్ట్యాంక్, హైదరాబాద్-500028 చిరునామాకు దరఖాస్తులను పంపాలని కోరారు. దరఖాస్తులను జర్నలిస్టు సంక్షేమ నిధి కమిటీ పరిశీలించి సాయాన్ని అందజేస్తుందని తెలిపారు. వివరాలకు 7702526489కు సంప్రదించాలని సూచించారు.