చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ వేసిన ఏడో ఓవర్ ఆఖరి బంతికి మయాంక్ అగర్వాల్..రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్కు వెనుదిరిగాడు. విజయ్ శంకర్ వేసిన తర్వాతి ఓవర్ మొదటి బంతిని క్రిస్ గేల్ కవర్ దిశగా షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న పూరన్.. డేవిడ్ వార్నర్ స్ట్రైకర్స్ ఎండ్ వైపు వేసిన డైరెక్ట్ త్రోకు రనౌటయ్యాడు. దీంతో పూరన్(0) డైమండ్ డక్గా పెవిలియన్ చేరాడు.
రషీద్ ఖాన్ వేసిన తొమ్మిదో ఓవర్లో ప్రమాదకర క్రిస్గేల్(15) వికెట్ల ముందు దొరికిపోయాడు. పంజాబ్ వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 9 ఓవర్లకు పంజాబ్ 4 వికెట్లకు 47 పరుగులు చేసింది. ప్రస్తుతం హెన్రిక్స్(0), దీపక్ హుడా(6) క్రీజులో ఉన్నారు. కనీసం ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండా బ్యాట్స్మన్ ఔటైతే డైమండ్ డక్ అంటారు.