ఉండవెల్లి, నవంబర్ 26: తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఏపీకి చెందిన కొందరు మిల్లర్లు, వ్యాపారులు అక్కడి ధాన్యాన్ని ఇక్కడకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు, నందిన్నె, బల్గిరా వద్ద ప్రత్యేక చెక్పోస్ట్లను ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఏపీకి చెందిన వ్యాపారులు అక్కడక్కడ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అయినా ధాన్యంతో వచ్చే లారీలను తిరిగి పంపిస్తున్నట్టు అధికారులు తెలిపారు.