హైదరాబాద్, జూలై 19 (నమస్తేతెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపడతామని, హైదరాబాద్ నగరంతోపాటు పట్టణ ప్రాంతాల్లో ఎల్ఐజీ తరహాలో ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడి వెల్లడించారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో దరఖాస్తు విధానం, అర్హతలపై బ్రోచర్ను విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.
ఇదే ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో 2.50 లక్షలు ఇండ్ల నిర్మాణాలు చేపడుతామని చెప్పారు. పట్టణాల్లో క్యూర్ పరిధిలో చేపట్టే ఇండ్ల కార్యక్రమాన్ని సోమవారం శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు. ఆదివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించిన ప్రభుత్వం, ప్రస్తుతం హైదరాబాద్ నగరంతోపాటు పట్టణ ప్రాంతాలకు ప్రాధాన్యం కల్పించనున్నట్టు చెప్పారు.