హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా గోదావరిపై అక్రమంగా పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నదని తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకుండా ఏపీని నిలువరించాలని కోరింది. ఈ మేరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్కు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ సోమవారం ఘాటుగా లేఖ రాశారు. గోదావరి నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా జీఆర్ఎంబీతోపాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టం చేస్తున్నదని, అయినా ఇదేమీ పట్టకుండా ఏపీ తన నీటి వాటా (518 టీఎంసీలు)కు మించి 776 టీఎంసీలను వినియోగించుకునేందుకు అక్రమం గా ప్రాజెక్టులను కడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.