హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఏపీకి చెందిన ఇద్దరు జిల్లా పంచాయతీ అధికారుల(డీపీవో)కు కోర్టు ధిక్కార కేసులో ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. గతంలో కర్నూలు జిల్లా డీపీవోగా పనిచేసి ప్రస్తుతం అనంతపురంలో ఉన్న ప్రభాకర్రావుకు ఓ కేసులో న్యాయస్థానం వారంరోజుల జైలు, రూ.2 వేల జరిమానా విధించింది.
మరో కేసులో చిత్తూరు డీపీవో దశరథరామిరెడ్డికి 15 రోజుల జైలు, రూ.2 వేల జరిమానా విధించింది. కాగా, తీర్పు అమలును వారంపాటు నిలిపివేస్తూ ..అప్పీల్కు వెళ్లే అవకాశం ఇచ్చింది. గ్రామ సచివాలయం నిర్మాణం విషయంలో హైకోర్టు స్టే పట్టించుకోకుండా ఈవోఆర్డీ ద్వారా చెల్లింపులు చేశారన్న అభియోగం రావడంతో న్యాయస్థానం సుమోటోగా కోర్టుధిక్కార కేసు నమోదు చేసి, శిక్ష ఖరారు చేసింది.