హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇప్పటికీ టీడీపీ నేతే అని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. ఏపీలోని అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడు తూ.. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా రాజకీయం జరిగిందని తెలిపారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకొని కుతంత్రాలతో బీఆర్ఎస్ పార్టీని ఓడించారని చెప్పారు. ఇదంతా ఎల్లో మీడియా, చం ద్రబాబు ప్లాన్ అని విమర్శించారు.