హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సూచనలతో ఏపీని అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా గంగుల మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత 15 సంవత్సరాల కిందట కరీంనగర్కు వచ్చానని, అప్పటికీ ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయన్నారు. కరీంనగర్ అంతా పచ్చదనంతో నిండిపోయిందని, ఎటుచూసినా నీరే కనిపిస్తుందన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనమని, ప్రత్యేక చొరవతో తెలంగాణను అభివృద్ధి చేశారని, దాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో క్రాప్ హాలిడే డిక్లేర్ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇక్కడ పంటలు బాగా పండుతున్నాయని చెప్పారు.