హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): మాజీ సీఎస్ సోమేశ్కుమార్పై సీబీఐ, ఈడీకి యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్ శ్రీకాంత్ నేత ఫిర్యాదు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమాస్తులు సంపాదించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులు, బినామీల పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు.
ఆయనకు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో, గుర్గావ్లో చాలా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయని, నోయిడాలోనూ కీలక ప్రాంతాల్లో బినామీల పేరుతో స్థలాలు కొన్నారని ఆరోపించారు. యాచారంలో సోమేశ్కుమార్ తన భార్య పేరిట కొన్న 25 ఎకరాల భూమిని ఫిర్యాదులో ప్రస్తావించారు. రాజకీయ నేతలకు అనుకూలంగా చాలా వివాదాస్పద జీవోలను జారీ చేశారని చెప్పా రు. అధికార దుర్వినియోగంతోనే వాటిని సంపాదించారని ఆరోపించారు. వెంటనే సోమేశ్కుమార్ ఆస్తులపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.