నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 22: రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని నేతాపురం సర్పంచ్ బాసిరెడ్డి కుమారి వెంకట్రెడ్డి, ముగ్గురు వార్డు సభ్యులతోపాటు 50 కుటుంబాల వారు కాంగ్రెస్ను వీడి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
చిట్యాలలో ఎలికట్టె గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో, వేములపల్లి మండలం మొల్కపట్నం, సల్కునూరు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు 250 మంది మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు సమక్షంలో, సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, వార్డు సభ్యులు, 30 మంది కార్యకర్తలు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీజేపీ, కాంగ్రెస్కు చెందిన వంద మంది టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన సుమారు 40 మంది మైనార్టీలు అచ్చంపేటలో విప్ గువ్వల బాలరాజు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.