హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్లో మరో కొత్త లింక్ రోడ్డును నిర్మించనున్నారు. సుమా రు 100 అడుగుల వెడల్పుతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ట్రాఫిక్ చిక్కులను నివారించేందుకు ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించిన ప్రభుత్వం కొత్త రోడ్ల నిర్మాణం చేపడుతున్నది. తాజాగా గచ్చిబౌలి ఐఎస్బీ నుంచి తెలంగాణ ఎన్జీవోస్ కాలనీ వరకు కొత్తగా లింకు రోడ్డును నిర్మించనున్నారు. ఐఎస్బీ రోడ్డు నుంచి ఎన్జీవోస్ కాలనీకి వెళ్లాలంటే విప్రో సర్కిల్ మీదుగా క్యూసి టీ వరకు వెళ్లి అదనంగా సుమారు 3.50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. ప్ర స్తుతం కొత్త లింకురోడ్డుతో ఆ దూరం 1.40 కిలోమీటర్లకు తగ్గనున్నది. దీనివల్ల విప్రో జం క్షన్, క్యూసిటీ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సమస్య తీరనున్నది. తెలంగాణ ఎన్జీవోస్ కాలనీలో కొత్త నివాసప్రాంతాలు గణనీయంగా పెరుగుతుండటంతో భవిష్యత్తులో ఈ లింకు రోడ్డు వల్ల ఎంతో మేలు కలుగుతుంది.