హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ కోర్సుల్లో మరో 49,267 మంది విద్యార్థులు సీట్లు పొందారు. వీరిలో మొదటి ప్రాధాన్యతగా 35,195 మంది విద్యార్థులు, రెండో ప్రాధాన్యతగా 14,072 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు. శుక్రవారం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్) రెండో విడత సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు 14 వరకు ఆన్లైన్లో సెల్ఫ్రిపోర్టింగ్ చేసుకొని సీటును రిజర్వ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
నేటి నుంచి మూడో విడత
దోస్త్ మూడో విడత కౌన్సెలింగ్ శనివారం నుంచి ప్రారంభంకానున్నది. విద్యార్థులు రూ.400 చెల్లించి 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ నెల 1 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక, 14న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 20న సీట్లు కేటాయిస్తారు. 24లోపు మూడు విడతల్లో సీట్లు పొందిన వారు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. 21 నుంచి 24 వరకు ఓరియంటేషన్ను నిర్వహించనుండగా, 24 నుంచి డిగ్రీ ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయి.
కోర్సుల వారీగా సీట్లు పొందిన వారు
కోర్సు సీట్లు పొందినవారు
ఆర్ట్స్ 6,307
కామర్స్ 21,255 (బీబీఏ -2,463)
లైఫ్సైన్సెస్ 11,944
ఫిజికల్ సైన్సెస్ 9,076
డాటాసైన్స్ (ఏఐఎంల్) 431
డీ -ఫార్మసీ 203
ఇతర కోర్సులు 51
మొత్తం 49,267