హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మరో 175 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. టౌన్ప్లానింగ్ విభాగంలో భర్తీచేయనున్న ఉద్యోగాలకు సంబంధించి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగంలో టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20 నుంచి అక్టోబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ వెల్లడించింది. వివరాలకు అభ్యర్థులు www. tspsc.gov. in ను చూడాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ సూచించారు.
చకాచకా నోటిఫికేషన్లు..
రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీచేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ఇప్పటివరకు 52,460 (65.5%) ఉద్యోగాల కు ఆర్థికశాఖ అనుమతులు మంజూరుచేసింది. గ్రూప్ -1 మొదలుకొని తాజా ప్రకటన వరకు చకచకా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇటీవలే మహిళా శిశు సంక్షేమశాఖలో 23 పోస్టులకు, తాజాగా 175 పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. గ్రూప్ -2, గ్రూప్ -3 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతినివ్వగా, త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి.
టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ అర్హతలు