వనపర్తి : రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో గొల్ల,కురుమ సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. అలాగే ఒక్కొ యూనిట్ ధర లక్షా 75 వేలకు పెంచడంతో సీఎం కేసీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి చిత్రపటాలకు జిల్లా కేంద్రంలో జిల్లా గొర్రెల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ ఆధ్వర్యంలో పాలాభిషేకాలు చేశారు. సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.