కూసుమంచి, మే 11: చెల్లి ఎంసెట్ కోసం వచ్చిన అన్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు హైవేపై చోటుచేసుకున్నది. ధర్మాతండాకు చెందిన సింధు, గురువాయిగూడేనికి చెందిన మేనత్త కుమార్తె హారిక గురువారం ఎంసెట్ రాయడానికి ఖమ్మం వచ్చారు.
సింధు సోదరుడు జర్పుల సందీప్ (21) వీరిని బైక్పై తీసుకెళ్తుండగా అగ్రహారం శివారులో ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఆగింది. దీంతో బైక్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సందీప్ అక్కడికక్కడే మృతిచెందగా సోదరి సింధు, హారికకు తీవ్రగాయాలయ్యాయి.