హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి చేయడం అమానుషమని ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు. వివాదరహితుడు, సౌమ్యుడు, కనీసం ఎప్పుడూ ఎవరినీ కోపంగా ఒక మాట అనని ప్రజా నాయకుడు కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి దారుణమని మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక దాడులకు చోటులేదని, దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి త్వరగా కోలుకొని, ఆరోగ్యంగా ప్రజల్లోకి రావాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.