హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బెయిల్ పిటిషన్పై విచారణ మళ్లీ వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టయిన చంద్రబాబు బెయిల్ పిటిషన్పై గురువారం ఉదయం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరఫు లాయర్లు వాదించగా, విచారణ కీలక దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇస్తే..సాక్షులపై ప్రభావం చూపించే అవకాశం ఉందని, విచారణ ముగిసే వరకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరఫు లాయర్లు వాదించారు. దాదాపు గంటపాటు వాదనల తరువాత విచారణను 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సీఐడీని ఆదేశించింది.