హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది. సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.1000 కోట్లు 20 ఏం డ్లకు 7.42 శాతం వడ్డీతో రుణం తీసుకోగా, మరో రూ.500 కోట్లు 18ఏండ్లకు 7.42 శాతం వడ్డీతో అప్పు తెచ్చారు. మరో రూ. 500 కోట్లు 16 ఏండ్లకు 7.43 శాతం వడ్డీ తో రుణం తెచ్చింది.
ఎఫ్ఆర్బీఎంలో జగన్ సర్కార్ ఈ ఏడాది రూ.22,500 కోట్ల అప్పు తెచ్చింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం రుణ పరిమితిలో రూ.8 వేల కోట్లే మిగిలాయి. 84 రోజుల్లో సెక్యూరిటీ బాండ్ల వేలంలో జగన్ సర్కార్ రూ. 22,500 కోట్ల అప్పు తెచ్చి రికార్డు సృష్టించింది.