సూర్యాపేట : టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆంధ్రాలో కేసీఆర్కు అద్భుతమైన ఆదరణ లభిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వాన్ని చాలా మంది ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఒక్క ఆంధ్రాలోనే కాదు.. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీఆర్ఎస్కు, కేసీఆర్కు అపూర్వ స్పందన లభిస్తుందని చెప్పారు.
హుజుర్నగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్తో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ప్రతి రంగంలోనూ తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఇప్పుడు దేశమంతా తెలంగాణ వైపే చూస్తుందన్నారు. మూడేండ్ల వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా పూర్తి చేశారని దేశమంతా చర్చ జరుగుతుందని తెలిపారు.
తెలంగాణను ఎడారి చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని, ఇబ్బంది పెట్టాలని మోదీ కుట్ర చేసినట్లు తెలుస్తుందన్నారు. కానీ కేసీఆర్ మాత్రం దేశాన్ని అద్భుతంగా మార్చాలని చూస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడానికి కారణం ఇదే అని స్పష్టం చేశారు. కేటీఆర్ పేరు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్నదని, ఆయన కంటే ఒక బ్రాండ్ అని జగదీశ్ రెడ్డి కొనియాడారు.