కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 28: భూమి పై భవిష్యత్తు తరాలు జీవించాలంటే వాతావరణంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయాల్సిన అవసరమున్నదని తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. జేఎన్టీయూహెచ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా వర్సిటీ ఆడిటోరియంలో బు ధవారం వాతావరణ మార్పు అంశంపై ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించారు.
వర్క్షాప్లో వీ ప్రకాశ్ మాట్లాడుతూ.. పర్యావరణంలో సమతుల్యత లోపించడం వల్ల తరచుగా వా తావరణ మార్పులు సంభవిస్తున్నాయని అన్నారు. అతిగా వర్షాలు, అతిగా ఉష్ణోగ్రతలు పెరగడం, వరదలతో ఆస్తి ప్రాణనష్టాలు లాంటి విపత్తులు ఎదురవుతున్నట్లు తెలిపారు. మూడేండ్లుగా రాష్ట్రంలో యాభై శాతంకంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావడానికి వర్సిటీలో ఏర్పాటుచేసిన వెదర్ స్టేషన్తో వా తావరణంలో మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, 15 నుంచి 20 కి.మీ దూ రంలో గాలి, ఉష్ణోగ్రత, వర్షాల తీరుపై అధ్యాయనం చేయవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్స్లర్ కట్టా నరసింహారెడ్డి, రెక్టార్ ఏ గోవర్ధన్, రిజిస్ట్రార్ ఎం మంజూర్ హుస్సేన్, ఐఎస్టీ డైరెక్టర్ శశికళ, కళాశాల ప్రిన్సిపాల్ జయలక్ష్మీ, కో ఆర్డినేటర్ ఎంవీఎస్ఎస్ గిరిధర్, యూఎస్ కాన్సుల్ జనరల్ సలీల్ ఖదేర్, బ్రనెక్స్ కమ్యూనిటీ కాలేజీ, క్రెస్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతినిధులు పాల్గొన్నారు.