మిర్యాలగూడ, డిసెంబర్ 31 : రైలు కిందపడి గుర్తుతెలియని యువతీయువకుడు ఆత్మహత్య చే సుకున్న ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రై ల్వేస్టేషన్ సమీపంలోని 115వ మైలు వద్ద శనివా రం రాత్రి జరిగింది. రైల్వే ఎస్సై పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం రైలు పట్టాలపై పడి ఉన్న సుమారు 25 సంవత్సరాల యువతి, 30 ఏండ్ల యువకుడి మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. వారి వద్ద రైల్వే టికెట్ తప్ప ఎటువంటి ఆధారాలు లభించలేదు.
విజయవాడ నుంచి సికింద్రాబాద్కు శనివారం ఉదయం 11గంటలకు తీసుకున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ జనరల్ టికెట్ మాత్రమే ఉన్నది. మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా దవాఖానలో భద్రపరిచారు. వారి వివరాలు తెలియలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వారు భార్యభర్తలా.. లేక ప్రేమికులా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.